అమరావతి : కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు (Yanamala Krishnadu) వైసీపీ (YCP) లో చేరారు. తాడేపల్లి సీఎం వైఎస్ జగన్ (YS Jagan) సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు శేషగిరిరావు, హరికృష్ణ, ఎల్. భాస్కర్ తదితరులున్నారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ టీడీపీ (TDP) ఆవిర్భావం నుంచి సేవలందించిన వారిని మోసం చేసి డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు.
చంద్రబాబు (Chandra Babu), తన సోదరుడు యనమల రామకృష్ణుడు చేసిన మోసాల వల్లే తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. తుని టిక్కెట్ ఇవ్వకపోగా ఘోరంగా అవమానించారని తెలిపారు. ఐదేండ్ల సీఎం వైఎస్ జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరారని ప్రకటించారు. ఆయన వెంట తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు.