సింగపూర్: భారత బ్యాడ్మింటన్ ‘డబుల్లెట్స్’ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. రెండేండ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు వరల్డ్ టూర్ టైటిల్ను గెలచుకున్నారు. ప్రతిష్టాత్మక సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్ పురుషుల డబుల్స్లో తొలిసారి విజేతలుగా నిలిచారు. ఈ ఘనత సాధించిన భారత తొలి జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ సాత్విక్-చిరాగ్ 18-21, 21-17, 21-16 తేడాతో మూడో ర్యాంక్ ద్వయం ఫజర్ అల్ఫియాన్-ముహమ్మద్ షోహిబుల్ ఫిక్రి (ఇండోనేషియా)పై అద్భుత విజయం సాధించింది.
గంటా 13 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోయినప్పటికీ, భారత జంట పట్టువిడకుండా పోరాడి టైటిల్ ఎగరేసుకుపోయింది. సాత్విక్-చిరాగ్ జంటకు రెండేండ్లలో ఇదే తొలి వరల్డ్ టూర్ టైటిల్. చివరిగా 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత నాలుగు టోర్నీల్లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్గానే నిలిచింది.ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్స్ అయిన సాత్విక్-చిరాగ్ కెరీర్లో ఇది మూడో సూపర్ 750 టైటిల్ కాగా.. 9వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ట్రోఫీ కావడం విశేషం.
రెండేండ్ల తర్వాత టైటిల్ గెలవడంతో కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక్కడికి వచ్చే ముందు మా గత రికార్డుల వల్ల కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ ఈ వారం మాకు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది
– సాత్విక్ సాయిరాజ్