అమీర్పేట్: డబ్ల్యూకేఎఫ్ కరాటే-1 యూత్ లీగ్కు తెలంగాణ బాలుడు సమర్జిత్సింగ్ ఎంపికయ్యాడు. అమీర్పేటకు చెందిన సర్దార్ భాగిందర్సింగ్ కుమారుడు సమర్జిత్ 9వ తరగతి చదువుతూ కరాటేలో రాణిస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ శిక్షణలో రాటుదేలిన ఈ హైదరాబాదీ.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఇప్పటివరకు 23 పతకాలు కొల్లగొట్టాడు. ఇదే ప్రదర్శనతో జూలై 1 నుంచి 3 వరకు వరకు క్రోయేషియా వేదికగా జరుగనున్న కరాటే-1 యూత్ లీగ్కు ఎంపికయ్యాడు. లీగ్కు ముందు క్రోయేషియాలోనే జూన్ 25 నుంచి 30 వరకు ప్రత్యేక శిక్షణ పొందనున్నాడు. అంతర్జాతీయ టోర్నీకి ఎంపికైన సమర్జిత్ను సోమవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట కార్పొరేటర్ సరళతో పాటు బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు బూర్గుల శ్యాంసుందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.