ఇటీవల విడుదలైన ‘పుష్ప’చిత్రంలోని ప్రత్యేకగీతం ‘ఊ..అంటావా మావ..’ యువతరాన్ని ఉర్రూతలూగిస్తున్నది. అగ్ర కథానాయిక సమంత తొలిసారి ఐటెంసాంగ్లో భాగం కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. చూడముచ్చటైన అందాలతో ఈ భామ ఐటెంసాంగ్లో అదరగొట్టింది. ఈ పాటకొస్తున్న క్రేజ్ పట్ల సమంత ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘నేను చేపట్టిన ప్రతి పనిలో పర్ఫెక్షన్ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాను. కేవలం నటన మాత్రమే కాకుండా బుల్లితెర షోస్లో కూడా భాగమయ్యా. ప్రతి సినిమా కోసం నేను కష్టపడతాను..అయితే సెక్సీగా కనిపించడానికి పడే కష్టం మరో స్థాయిలో ఉంటుంది. మీ అందరి ప్రేమకు కృతజ్ఞురాలిని’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా చిత్రం ‘యశోద’లో నటిస్తున్నది. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది.