న్యూఢిల్లీ: ఒర్లిన్స్ మాస్టర్స్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు సాయి ప్రణీత్, అనుపమ ఉపాధ్యాయ, ఐరా శర్మ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ రెండో రౌడ్లో టాప్ సీడ్ సాయిప్రణీత్ 21-19, 21-12తో జాన్ లూడ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్లో అనుపమ ఉపాధ్యాయ, ఐరా శర్మ విజయాలతో రెండో రౌండ్కు చేరగా.. మిక్స్డ్ డబుల్స్లో ఇషాన్ భట్నాగర్-తనీషా క్రాస్టో జోడీ ప్రిక్వార్టర్స్కు చేరింది.