ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ ఖాళీ బస్తా రైలు పట్టాలపై పరుచుకుని రైలుకు అడ్డంగా పడుకున్నాడు. అయితే రైలు అతడిని సమీపించే లోపు అప్రమత్తమైన రైల్వే పోలీసులు.. పరుగున అతని దగ్గరకు వెళ్లి పట్టాలపై నుంచి పక్కకు లాగేశారు. అతడిని లాగేసిన కొద్ది క్షణాల్లోనే రైలు ఆ ట్రాక్ పైనుంచి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.