IND vs ENG 3rd Test : తొలి రెండుటెస్టుల్లో భారీ స్కోర్ చేయలేకపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ(105 నాటౌట్ 162 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో టెస్టులో సెంచరీ సాధించాడు. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడిన హిట్మ్యాన్ శతకంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 11వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు.
టీ సెషన్ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్లో రెండు రన్స్ తీసిన రోహిత్ వంద పూర్తి చేసుకున్నాడు. దాంతో ఓపెనర్గా మూడో సెంచరీ బాదిన నాలుగో భారత క్రికెటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు విజయ్ మర్చంట్(Vijay Merchant), మురళీ విజయ్(Murali Vijay), కేఎల్ రాహుల్(KL Rahul)లు ఈ ఫీట్ సాధించారు.
💯! 👍 👍
Captain leading from the front & how! 🙌 🙌
Well played, Rohit Sharma 👏 👏
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/BAfUCluE2H
— BCCI (@BCCI) February 15, 2024
విధ్వంసక ఆటకు మారుపేరైన రోహిత్.. రాజ్కోట్ టెస్టులో మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును రవీంద్ర జడేజా(68)తో కలిసి ఆదుకున్నాడు. లంచ్ తర్వాత బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో ఇద్దరూ దూకుడుగా ఆడారు. నాలుగో వికెట్కు 152 పరుగులు జోడించారు. విశేషం ఏంటంటే.. ఈ సిరీస్లో ఒక సెషన్లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం ఇదే మొదటిసారి. జడేజా, రోహిత్ జోరుతో టీమిండియా టీ బ్రేక్ సమయానికి మూడు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.