లండన్: ఆల్ టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్ టెన్నిస్ ఆటకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తన చివరి టోర్నీ లావెర్ కప్లో ఆడేందుకు బ్రిటన్ వచ్చిన ఫెదరర్..అక్కడ తన తోటి మిత్రుల్ని కలుసుకున్నారు. మేటి ఆటగాళ్లు రఫేల్ నాదల్, జోకోవిచ్, ఆండీ ముర్రేలను డిన్నర్కు ఆహ్వానించిన ఫెదరర్ ఆ తర్వాత వారితో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఫెడక్స్ చేసిన ట్వీట్కు 4 లక్షల మంది లైక్ చేశారు. మరో 40 వేల మంది రీట్వీట్చేశారు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లోనూ ఈ నలుగురు మైదానంలో కనిపించారు. లావెర్ కప్ డబుల్స్లో ఫెదరర్, నాదల్లు శుక్రవారం డబుల్స్ మ్యాచ్ ఆడనున్నారు. నాదల్(22), జోకోవిచ్)21), ఫెదరర్(20), ముర్రే(3).. ఈ నలుగురు కలిపి 66 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న 41 ఏళ్ల ఫెదరర్ గత వారం టెన్నిస్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
heading to dinner with some friends @RafaelNadal @andy_murray @DjokerNole pic.twitter.com/2oYR3hnGaZ
— Roger Federer (@rogerfederer) September 22, 2022