జైపూర్, నవంబర్ 24: రోడ్లు నటీమణులు హేమామాలిని, కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలని రాజస్థాన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గుఢా వ్యాఖ్యానించారు. ఝుంఝునూ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా రాజేంద్ర సింగ్ స్పందిస్తూ నోరుజారారు. రోడ్లు హేమమాలిని చంపల్లా ఉండాలంటూనే ఆమె చాలా ఓల్డ్ అయిపోయారని వెటకారం చేశారు. తర్వాత కత్రినా కైఫ్ పేరును తెచ్చారు. రోడ్లు ఆమె చంపల్లా ఉండాలన్నారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన 15 మంది కొత్త మంత్రుల్లో రాజేంద్ర సింగ్ ఒకరు.