హైదరాబాద్ : లైంగిక దాడి ఘటనలో బాధితురాలి హక్కులే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. 16 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి కేసులో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా బాలిక 26 వారాల గర్భం తొలగింపునకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈ మేరకు పిండాన్ని తొలగించాలని కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాగా గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలి అబార్షన్కు ఆస్పత్రి నిరాకరించడంతో బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిపింది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని పేర్కొంది. చట్ట పరిధిలో అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు మహిళలకు ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయసేన్రెడ్డి పేర్కొన్నారు.