హైదరాబాద్, డిసెంబర్1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో వాయు కాలుష్యానికి గల కారణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై సిఫారసులతో కూడిన నివేదికను జైరాం రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్కు అందజేసింది. ఈ కమిటీలో తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్తో పాటు వందన చవాన్ సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీ కాలుష్యం అంశంతో పాటు బయోటెక్నాలజీ, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లకు ఉన్న నిధుల డిమాండ్, క్యాన్సర్ చికిత్సలో అటామిక్ ఎనర్జీ పాత్ర విస్తరణ తదితర అంశాలపై కూడా కమిటీ పలు సిఫారసులను చేసింది. ఈ మేరకు ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ ట్విట్టర్లో వెల్లడించారు.