ముంబై: ప్రఖ్యాత గజల్ గాయకుడు భూపిందర్ సింగ్ కన్నుమూశారు. నామ్ గుమ్ జాయేగీ, దిల్ దూండ్తా హై లాంటి పాపులర్ పాటలను ఆయన పాడారు. కొలన్ క్యాన్సర్, కోవిడ్ సంబంధిత రుగ్మతల వల్ల ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 82 ఏళ్లు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ పాటలను భూపిందర్ పాడారు. దో దివానే షెహర్ మే, ఏక్ అకేలా ఇస్ షెమర్ మే, తోడీ సీ జమీన్ తోడా ఆస్మాన్, దునియా చుటే యార్ నా చుటే, కరోగి యాద్ తో లాంటి ఎన్నో సుమధుర గీతాలను ఆయన ఆలపించారు. మూత్ర ఇన్ఫెక్షన్తో భూపిందర్ను హాస్పిటల్లో చేర్పించినట్లు ఆయన భార్య మితాలి సింగ్ తెలిపారు. రఫి, బర్మన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, గుల్జార్, బప్పిలహరితో ఆయన కలిసి పనిచేశారు. దమ్ మారో దమ్, చురా లియా హై, చింగారి కోయి బడ్కే, మెహబూబా ఓ మెహబూలా లాంటి పాటలకు గిటారిస్ట్గా చేశారు. భూపిందర్ సింగ్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నివాళి అర్పించారు.