ముంబై: జియోమార్ట్, వాట్సాప్ మధ్య కుదిరిన భాగస్వామ్యం గురించి ఇషా అంబానీ ప్రకటన చేశారు. జియోమార్ట్, వాట్సాప్ యూజర్లు ఇక నుంచి వాట్సాప్ పే, క్యాష్ ఆన్, డెలివరీతో పాటు ఇతర పేమెంట్ పద్ధతుల్ని వాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. డిజిటల్ కామర్స్ ఫ్లాట్ఫామ్ వృద్ధి బాగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ప్రతి రోజు ఆరు లక్షల ఆర్డర్లు జరుగుతున్నట్లు ఆమె తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 2.5 రెట్లు ఎక్కువ అని ఆమె చెప్పారు. ప్రస్తుతం 260 పట్టణాల్లో జియోమార్ట్ డెలివరీ సాగుతోందన్నారు. ఆన్లైన్ గ్రోసరీలో ఇండియాలోనే నెంబర్ వన్గా ఉన్నట్లు ఇషా అంబానీ తెలిపారు. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వ్యాపారాన్ని ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఇషా చెప్పారు. అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల్ని ప్రతి వ్యక్తికి అందేలా చేస్తామని ఆమె అన్నారు.