న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రిలయన్స్ జియో సంచలన 4జీ స్మార్ట్ఫోన్.. జియోఫోన్ నెక్స్ దీపావళికే మార్కెట్లోకి విడుదల అవుతుందని గూగుల్ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్ పిచాయ్ ప్రకటించారు. గూగుల్ మాతృ సంస్థ అల్ఫాబెట్ ఆర్థిక ఫలితాల సందర్భంగా బుధవారం పిచాయ్ ఈ మేరకు స్పష్టం చేశారు. జియోఫోన్ నెక్స్ట్ ను జియో, గూగుల్ కలిసి తయారు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్న ఈ మొబైల్కు.. సెమికండక్టర్ (చిప్)ల కొరత అడ్డుపడింది. కాగా, ఈ ఫోన్లోని ట్రాన్స్లేషన్ ఆప్షన్.. వినియోగదారులకు ఎంతగానో లాభించగలదన్న విశ్వాసాన్ని పిచాయ్ వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫోన్లోని ఫీచర్లు, కొన్ని విశేషాలు బయటకు రాగా, దేశంలోని సుమారు 30 కోట్ల 2జీ కస్టమర్లే లక్ష్యంగా వస్తున్న ఈ చౌక స్మార్ట్ఫోన్ ధర దాదాపు రూ.5,000లుగా ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి.
జియోఫోన్ నెక్స్ట్ ఫీచర్స్?
విశేషాలు
ఆండ్రాయిడ్ ఆధారిత ప్రగతి ఓఎస్