న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో గతేడాది పతనమైన ముడి చమురు ధరలు.. కరోనా కష్టకాలంలో తగ్గిన డిమాండ్, ఉత్పత్తిలో కోతతో తలెత్తిన నష్టాలు.. సంస్థ వాటాదారులకు 7500 కోట్ల డాలర్ల వార్షిక డివిడెండ్ చెల్లింపు సమస్య.. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్కు కంటగింపుగా మారింది.
ఫలితంగా రిలయన్స్ అనుబంధ ఆయిల్ రిఫైనరీలో వాటాల కొనుగోలుకు జాప్యం అవుతుందని ప్రముఖ రీసెర్చ్ ఫర్మ్ జెఫెర్రీస్ వ్యాఖ్యానించింది. భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ 2019 ఆగస్టులోనే తన ఆయిల్ రిఫైనరీ సంస్థలో 20 శాతం వాటాలను విక్రయిస్తామని ప్రకటించారు.
రిలయన్స్ రుణ భారాన్ని తగ్గించుకోవడానికి సంస్థ వాటాలను విక్రయిస్తున్నట్లు ముకేశ్ అంబానీ అప్పట్లోనే ప్రకటించారు. కానీ 2020 మార్చిలోనే రెండు సంస్థల మధ్య ఎంవోయూ కుదరాల్సి ఉన్నా జాప్యమైంది. కానీ జాప్యానికి కారణాలు రెండు సంస్థలు కూడా ప్రకటించలేదు. చైనా, భారత్లలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని జెఫెర్రీస్ పునరుద్ఘాటించింది..
గుజరాత్లోని జాంనగర్లో గల రిలయన్స్ పెట్రో కెమికల్ జంట రిఫైనరీలు ఈ పెట్రో కెమికల్స్ రిఫైనరీ సంస్థ పరిధిలోకి వస్తాయి. గమ్మత్తేమిటంటే జాంనగర్లోని జంట పెట్రో కెమికల్ రిఫైనరీలు ప్రపంచంలోకెల్లా అతిపెద్దవి కూడా.
ముడి చమురును శుద్ధి చేశాక ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది రిలయన్స్. దీంతో రిలయన్స్ పెట్రో కెమికల్స్ రిఫైనరీలు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎగుమతిదారులుగా పేరెన్నికగన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లకు దిగి వస్తే ఆ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నారు.
ఇటీవల సైతం ఇంటర్నేషనల్ రేటింగ్స్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సైతం.. రిలయన్స్ల వాటాల కొనుగోలుపై చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నది. ఈ డీల్ పరిధిలోకి ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే కేజీ-డీ6 బ్లాక్ను జత కలుపలేదు.
చైనాలో అతిపెద్ద ఆయిల్ అండ్ కెమికల్ ప్రాజెక్టులో ఆరామ్ కో వాటా కలిగి ఉంది. దీర్ఘకాలం పాటు ముడి చమురు సరఫరా చేయడంతోపాటు ఆరీగా రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని చైనా సర్కార్తో ఆరామ్కో ఒప్పందం చేసుకున్నది.