2008లో రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమాతో సిల్వర్ స్క్రీన్పై మెరిసింది శియా గౌతమ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం తర్వాత మరే మూవీలో కనిపించలేదీ భామ. ముంబైకి చెక్కేసిన ఈ భామ సంజు చిత్రంలో మెరిసినా..మరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఈ బ్యూటీ 11 ఏండ్ల విరామం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో శియాగౌతమ్ కోసం కీ రోల్ డిజైన్ చేసినట్టు ఫిలింనగర్ సర్కిల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ ప్రాజెక్టులో శియాగౌతమ్ నటిస్తుందనేది దానిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.