రణబీర్కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న సినిమా ‘యానిమల్’. ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హిమాలయాల్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలుపెట్టారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు. సినిమాలో నటించబోయే నటీనటుల, పనిచేయనున్న సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.