న్యూఢిల్లీ: టాటా ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ ప్రధాన డ్రాకు భారత ఆటగాడు రామ్కుమార్ రామనాథన్ అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన అర్హత పోటీలో రామ్కుమార్ 6-3, 7-5తో ఇటలీకి చెందిన మాటియా బెలూచిపై విజయం నమోదు చేశాడు. కాగా భారత్కే చెందిన యుకి బాంబ్రి అర్హత సాధించలేకపోయాడు. బాంబ్రి 1-6, 4-6తో స్వీడన్కు చెందిన ఎలియాస్ యమర్ చేతిలో ఓడిపోయాడు. ఇతర భారత ఆటగాళ్లు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్, సిద్దార్ధ్ రావత్ , ఆదిత్య బాల్శేఖర్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు.