దుబాయ్: ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ చిత్తు అయిన విషయం తెలిసిందే. ట్రోఫీని శ్రీలంక ఆరోసారి ఎగురేసుకుపోయింది. అయితే ఆసియాకప్ ఫైనల్లో పాక్ ఓటమి గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజాను ఓ ఇండియన్ జర్నలిస్టు ప్రశ్న వేశాడు. ఓటమి గురించి సందేశం ఇవ్వాలని రమీజ్ను కోరాడు. ఆ సమయంలో పీసీబీ చీఫ్ కాస్త అసహనానికి గురయ్యాడు. నువ్వు ఇండియా నుంచి వచ్చిన జర్నలిస్టువా అని అడిగాడు. ఫైనల్ ఫలితం పట్ల ఇండియన్ ఫ్యాన్స్ కూడా సంతోషంగా ఉండి ఉంటారని రమీజ్ అన్నాడు. అయితే అలాంటిదేమీ లేదని జర్నలిస్టు సమాధానం ఇవ్వడంతో రమీజ్ మరింత అసహనానికి లోనయ్యాడు. తాను వేసిన నిజమైన ప్రశ్నే అని జర్నలిస్టు అన్నాడు. కాస్త ఒడిదిడికుడులో ఉన్న రమీజ్ అక్కడ నుంచి వెళ్లిపోతూ.. జర్నలిస్టు ఫోన్ను నెట్టివేశాడు. రమీజ్ ఎందుకు తన ఫోన్ను లాగేసే ప్రయత్నం చేశాడని ఆ జర్నలిస్టు తన ట్విట్టర్లో ప్రశ్నించాడు. ఫైనల్లో శ్రీలంక తొలుత ఆరు వికెట్లకు 170 రన్స్ చేయగా.. ఆ తర్వాత పాక్ 147 రన్స్కు ఆలౌటైంది.
Reaction of PCB chairman Ramiz Raja after Pakistan lose Asia Cup 2022 and looked at the reply of PCB chairman on Journalist. pic.twitter.com/3u8TLdxYNm
— CricketMAN2 (@ImTanujSingh) September 11, 2022