రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశ కౌశిక్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్నది. ఈ చిత్రాన్ని జూన్ 17న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. యదార్థ ఘటనల ఆధారంగా చిత్రాన్ని నిర్మించామని, యాక్షన్ ఎంటర్ టైనర్గా అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా ఆకట్టుకునేలా ఉంటుందని నిర్మాత తెలిపారు. రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్ వీకే తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : సామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్.