మనామా(బహ్రెయిన్): భారత టెన్నిస్ ప్లేయర్ రామ్కుమార్ రామనాథన్ తన కెరీర్లో తొలి ఏటీపీ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రొఫెషనల్ ప్లేయర్గా మారిన 12 ఏండ్ల తర్వాత సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఏటీపీ చాలెంజర్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రామ్కుమార్ 6-1, 6-4 తేడాతో ఎవ్జెనీ కార్లోవ్స్కీ(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. 68 నిమిషాల పాటు జరిగిన పోరులో ఈ 27 ఏండ్ల ప్లేయర్ వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఈ టైటిల్ గెలువడం ద్వారా 80 పాయింట్లు ఖాతాలో వేసుకున్న రామ్కుమార్ ప్రస్తుతం 222 ర్యాంక్లో ఉన్నాడు. ఈ టైటిల్ గెలిచే వరకు తన కెరీర్లో ఆరు చాలెంజర్ ఫైనల్స్లో ఓటమి చవిచూశాడు.