న్యూఢిల్లీ: కమీడియన్ రాజు శ్రీవాత్సవ్ స్పృహలోకి వచ్చాడు. 15 రోజుల క్రితం గుండెపోటతో హాస్పిటల్లో చేరిన అతను కోమాలో ఉన్న విషయం తెలిసిందే. అతన్ని ఎయిమ్స్ వైద్యులు మానిటర్ చేస్తున్నారని గర్విత్ నారంగ్ తెలిపారు. ఆగస్టు 10వ తేదీన గుండెపోటు రావడంతో ఢిల్లీ హాస్పిటల్లో రాజు శ్రీవాత్సవ్ను అడ్మిట్ చేశారు. జిమ్ చేస్తున్న సమయంలో అతనికి ఛాతి నొప్పి వచ్చింది. వర్కౌట్ చేస్తూ అతను కుప్పకూలిపోయాడు. అదే రోజున 58 ఏళ్ల శ్రీవాత్సవ్కు ఆంజియోప్లాస్టీ చేశారు. 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్లో గెలిచిన శ్రీవాత్సవ్ ఆ తర్వాత తన కెరీర్లో ఫుల్ సక్సెస్ సాధించారు.