చటోగ్రామ్: ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (106 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరిగిన చివరి వన్డేలో అఫ్గనిస్థాన్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు వన్డేలు నెగ్గిన బంగ్లా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోగా.. సోమవారం జరిగిన నామమాత్ర పోరులో అఫ్గన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 46.5 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (86) అర్ధశతకంతో రాణించగా.. సీనియర్ ప్లేయర్లు షకీబ్అల్ హసన్ (30), మహ్ముదుల్లా ఓ మోస్తారుగా ఆడారు. కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (11), రహీమ్ (7) అలీ (1), అఫిఫ్ హుసేన్ (5) విఫలమయ్యారు. అఫ్గన్ బౌలర్లలో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3, మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గన్ 40.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసింది. రహ్మానుల్లా శతక్కొట్టగా.. అతడికి రియాజ్ (35), రహ్మత్ షా (47) తోడ్పాటు అందించారు. లంక బౌలర్లలో మెహదీ హసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. రహ్మానుల్లాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, లిటన్ దాస్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.