ప్రేమను, జీవితాన్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగించే ఓ లోకసంచారి మనోభావాలకు దర్పణమే ‘సంచారి..’ పాట అని చెప్పారు రాధాకృష్ణకుమార్. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’.సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులముందుకురానుంది. పూజాహెగ్డే కథానాయిక.
ఈ సినిమాలోని ‘సంచారి’ అనే గీతాన్ని గురువారం విడుదల చేశారు. ‘కొత్త నేలపై కాలి సంతకం..కొండ గాలితో శ్వాస పంపకం..తెరిచా హృదయం కడుతూ స్నేహం..గెలిచా ప్రతిశిఖరం..బతుకే పయనం..వదిలేయ్ జగడం’ అంటూ చక్కటి సాహిత్యంతో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. ఓ యాత్రికుడిగా ప్రభాస్పై చిత్రీకరించిన విజువల్స్ అందంగా కనిపిస్తున్నాయి.
ఈ గీతానికి జస్టిన్ ప్రభాకరన్ స్వరాల్ని సమకూర్చారు. ‘ఇటలీ నేపథ్యంలో సాగే వింటేజ్ ప్రేమకథా చిత్రమిది. భవిష్యత్తును ఊహించే విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ వైవిధ్యంగా కనిపిస్తారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్లుక్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సచిన్ఖేడ్కర్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్పరమహంస, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, నిర్మాణ సంస్థలు: గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.కె.రాధాకృష్ణకుమార్.