ప్రముఖ రచయిత,దర్శకుడు నంద్యాల రవి ఇటీవల తీవ్రమైన కరోనా బాధపడుతూ ఆసుత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హాస్పిటల్ బిల్లు రూ.6- 7 లక్షలు వరకు అయిందట. డైరెక్టర్ కుటుంబానికి అంత పెద్ద మొత్తాన్ని భరించే శక్తి లేదు. దీంతో విషయం తెలుసుకున్న సప్తగిరి తన మానవతా సాయంగా లక్ష అందించారు .
తాజాగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత, శ్రీశ్రీ కె రాధామోహన్ లక్ష రూపాయలు ఆర్ధిక సాయం అందిచారు. అంతేకాదు డాక్టర్ జాఫర్తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. ప్లాస్మా డొనేట్ చేయడంలో కూడా రాధా మోహన్ కో ఆర్టినేట్ చేస్తున్నారు. నంద్యాల రవి త్వరగా కోలుకోవాలని ప్రముఖులతో పాటు పలువురు అభిమానులు ప్రార్ధిస్తున్నారు.