నర్సంపేట, నవంబర్ 10: కేంద్రం అమలుచేస్తున్న నల్ల చట్టాలతో రైతులు నడిబజారులో నిలబడాల్సి వస్తుందని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాను నిర్మించిన రైతన్న సినిమాను చూడాలని ఎమ్మెల్యేను కోరారు. రైతులకు అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. గతంలో బీహార్లో ఈ తరహా చట్టాలతో రైతులంతా కూలీలుగా మారిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుబంధు వంటి ఎన్నో పథకాలు తెచ్చి ఆదుకుంటున్నారని కొనియాడారు.