ైస్టెలిష్స్టార్ నుంచి నేడు ఐకాన్స్టార్గా తన గుర్తింపుకు దర్శకుడు సుకుమార్ కారణమని కథానాయకుడు అల్లు అర్జున్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘పుష్ప’ థాంక్స్మీట్లో మాట్లాడిన బన్నీ చిత్ర యూనిట్ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. ‘డార్లింగ్ నువ్వులేకపోతే నేను లేను..‘ఆర్య’ లేదు.. ఇంకా ఏమీ లేదు’ అని బన్నీ భావోద్వేగానికిగురయ్యారు.
ఆయన మాటలు విన్న సుకుమార్ కూడా ఎమోషన్ను ఆపుకోలేకపోయారు. ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది.
ఇదే వేదికపై గీత రచయిత చంద్రబోస్కు సుకుమార్ పాదాభివందనం చేశారు. చంద్రబోస్ అంతటి అక్షరజ్ఞాని, మేధాశక్తి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. చంద్రబోస్ ప్రతిభాసామర్థ్యాలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని చెప్పారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ‘పుష్ప’ చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది.
చిత్ర విజయాన్ని పురస్కరించుకొని మంగళవారం థాంక్స్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘వ్యవసాయ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడిపైకొచ్చిన తాతయ్యకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, కెరీర్ ఆరంభం నుంచి సపోర్ట్నిస్తున్న చిరంజీవిగారికి, నా సినీ ప్రయాణాన్ని మలుపుతిప్పిన సుకుమార్కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ‘పరుగు’ టైమ్లో అనుకుంటా..85 లక్షలు పెట్టి ఓ స్పోర్ట్స్ కారు కొన్నా. స్టీరింగ్ మీద చేయి పెట్టి నేను ఇంతదూరం వచ్చానంటే ఎవరెవరు కారణమని ఆలోచించా. అప్పుడు నా మైండ్లో తట్టిన మొదటి వ్యక్తి సుకుమార్గారు.
‘డార్లింగ్..నువ్వు లేకపోతే నేను లేను..ఆర్య లేదు.ఇంకా ఏమీ లేదు. నన్ను ైస్టెలిష్స్టార్ నుంచి ఈరోజు ఐకాన్ స్టార్గా దేశం మొత్తం గుర్తించేలా చేశావంటే అది నీ వల్లే సాధ్యమైంది’ అని బన్నీ ఆనందం వ్యక్తం చేశారు. సుకుమార్ మాట్లాడుతూ ‘నా కష్టంలో సగభాగం నా భార్యకు చెందుతుంది కాబట్టి తొలుత నా శ్రీమతి తబితకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ను తక్కువగా అంచనా వేశా. అతని పాన్ఇండియా స్టామీనాను ఊహించలేకపోయా. ఈ సినిమాను నేపాల్, అస్సాంలో కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పినప్పుడు నాలో నేను నవ్వుకున్నా. ఇవన్నీ సాధ్యమేనా అనిపించింది. కానీ ఈ రోజు జాతీయస్థాయిలో కలెక్షన్స్ చూస్తుంటే బన్నీ ఎంత ఎత్తుకు ఎదిగాడో తెలిసింది. ఈ సినిమా నార్త్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలుసుకోవడానికి ఓసారి ముంబయికి వెళ్లి సినిమా చూడాలనుకుంటున్నా. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ను కలుసుకున్నా.
మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది. ‘పుష్ప-2’ తర్వాత దీనిని ఓ వెబ్సిరీస్లా చేయాలనుకుంటున్నాం’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని మాట్లాడుతూ ‘ఇప్పటికి ఈ సినిమా 275కోట్ల గ్రాస్ చేసింది. లాంగ్న్ల్రో 325 నుంచి 350 కోట్ల వసూళ్లు రావొచ్చని అంచనా వేస్తున్నాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.