బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో పుణెరీ పల్టన్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన పోరులో పుణెరీ 42-23తో యూ ముంబాపై గెలుపొందింది. పుణెరీ తరఫున నితిన్ (9), అస్లమ్ (7), రాణించారు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 37-28 తేడాతో తమిళ్ తలైవాస్పై నెగ్గింది.