హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎంపీడీవోల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు ఎంపీడీవోల సంఘం వినతిపత్రం సమర్పించింది. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రిని శనివారం ఆ సంఘం నాయకులు కలిశారు. ఎంపీడీవోల పదోన్నతులు, డిప్యూటేషన్లు, బదిలీలు తదితర అంశాలను పరిష్కరించాలని కోరారు. తమ సమస్యల పట్ల మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సంఘం నేతలు తెలిపారు.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న ఆమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఆటా ప్రతినిధి బృందం ఆహ్వానించింది. శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఎర్రబెల్లిని కలిసిన ఆటా ప్రతినిధులు జయంత్ చల్లా, శరత్ వేముల, రఘువీర్రెడ్డి, భువనేశ్ బుజాల, సన్నీరెడ్డి తదితరులు.. 17వ మహాసభలు ఘనంగా నిర్వహిస్తున్నామని, సభలకు తప్పకుండా రావాలని మంత్రిని కోరారు.