సుల్తాన్బజార్, నవంబర్ 30 : అడగక ముందే అందరి సమస్యలు పరిష్కరిస్తున్న మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అన్నారు. మంగళవారం కోఠిలోని డీఎంఈ ఆవరణలో టీఆర్ఎస్కేవీ అనుబంధ సంస్థ తెలంగాణ సెకండ్ ఏఎన్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్ వినయ పూర్వక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. కరోనా విపత్కర సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కరుణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షురాలు సీహెచ్.అనురాధ, ఉపాధ్యక్షులు పుష్పలత, వరలక్ష్మి, కోశాధికారి తారాదేవి, సభ్యులు సరస్వతి, సుజాత, వనజ, ప్రమీల, రాధ, శారద, సుందరి, హేమ, మంజుల, సరోజ, రాజేశ్వరీ, కృష్ణవేణి, మాధవి తదితరులు పాల్గొన్నారు.