న్యూయార్క్: పశ్చిమాసియా ఘర్షణల ప్రకంపనలు న్యూయార్క్ లో వినిపించాయి. ఇజ్రేల్, పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు అమెరికా ఆర్థిక రాజధాని వీధుల్లో తలపడ్డారు. అక్కడ ఇజ్రేల్ ప్రభుత్వం, పాలస్తీనా హమాస్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం. సుప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో పోటాపోటీ నిరసనల సమయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం ముష్టిఘాతాలకు దిగిన నిరనకారులను పోలీసులు విడిపించలేక సకతమతమయ్యారు. ఈలోగా కారులో నుంచి ఓ వ్యక్తి రెండు దీపావళి పటాసులు జనం మీదకు విసిరి వెళ్లాడు. వాటివల్ల ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.