ఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీ ఎయిమ్స్లో రాష్ట్రపతి రామ్నాథ్కు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలిపారు. ఎయిమ్స్ డైరెక్టర్తో మాట్లాడి రాష్ట్రపతి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు వెల్లడించారు. ఆపరేషన్ విజయవంతంపై వైద్యులకు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి ఆరోగ్యం కోసం, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిద్దామని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఛాతిలో నొప్పి కారణంగా అస్వస్థతకు గురైన రాష్ట్రపతిని సిబ్బంది వెంటనే ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షల అనంతరం ఢిల్లీ ఎయిమ్స్కు తరలించారు.