మూసీ పేరెత్తితేనే వామ్మో అంటారు.. అది దుర్గంధానికి కేరాఫ్ అడ్రస్లా మారిపోయింది. మూసీ అంటే మురికికూపం అని అందరి మదిలో నిలిచిపోయింది. ఇప్పుడదంతా గతం.. తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టడంతో ముచుకుందా నదికి పూర్వవైభవం వచ్చింది. ఆకుపచ్చ కోక కట్టుకుని అందాలతో సందర్శకులను మైమరిపిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సరికొత్త సొబగులు సంతరించుకుంది. ముచుకుందా తీరమంతా గతవైభవాన్ని గుర్తుచేసేలా పరిమళమైన పూల గాలులతో పచ్చందాలు పంచుతోంది.