న్యూఢిల్లీ: మహాభారత్ సీరియల్లో భీముడి పాత్ర పోషించిన నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్లు. ప్రవీణ్ కుమార్ మరణించినట్లు ఆయన కుమార్తె నికునికా వెల్లడించారు. సోమవారం రాత్రి 9.30 నిమిషాలకు తన తండ్రి ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె తెలిపారు. హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని స్వంత ఇంట్లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్ సిరీయల్లో భీముడి పాత్రతో ప్రవీణ్ దేశవ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ఇంకా అనేక బాలీవుడ్ సినిమాల్లోనూ అతను నటించాడు. అమితాబ్ తీసిన షెహెన్షా, ధర్మేంద్ర తీసిన లోహ చిత్రాల్లోనూ ప్రవీణ్ పాత్రలు పోషించాడు. ఆజ్ కా అర్జున్, అజూబా, ఘాయల్ లాంటి హిట్ చిత్రాల్లోనూ అతను నటించాడు.
యాక్టింగ్ కెరీర్లోకి రావడానికి ముందు ప్రవీణ్.. స్పోర్ట్స్లో రాణించారు. హ్యామర్, డిస్కస్ త్రో అథ్లెట్గా అతను కెరీర్ను కొనసాగించాడు. నాలుగు సార్లు ఆసియా క్రీడల్లోనూ అతను మెడల్స్ అందుకున్నాడు. 1968లో మెక్సికోలో, 1972లో మ్యూనిచ్లో జరిగిన ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రవీణ్కు అర్జున్ అవార్డు కూడా దక్కింది. బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్లో అతను డిప్యూటీ కమాండెంట్గా పనిచేశాడు. 2013లో ఆమ్ ఆద్మీ టికెట్పై ఢిల్లీ అసెంబ్లీలో పోటీపడ్డాడు.