వరుసగా మూడోసారి అవకాశం
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ముందుగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకొని, మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్సీలతో కలిసి బడ్జెట్ ప్రతులతో కౌన్సిల్కు హాజరయ్యారు. మంత్రికి మండలి ప్రొటెం చైర్మన్ జాఫ్రీ పుష్పగుచ్ఛం అందిం చి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ అనుమతితో 11:30 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి.. 1:30 గంటలకు ముగించారు. మండలిని చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. మండలిలో వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన అవకాశాన్ని మంత్రి వేముల సొంతం చేసుకొన్నారు.