న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి స్టన్నింగ్ షో ప్రదర్శించాడు. ఎఫ్టీఎక్స్ క్రిప్టో కప్ టోర్నీలో వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్సన్ పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. వరుసగా మూడు గేమల్ను గెలిచాడు. బ్లిట్జ్ టై బ్రేక్లో రెండు గేమ్లు గెలిచాడు. కార్ల్సన్పై విక్టరీ కొట్టినా.. తుది ఫలితాల్లో మాత్రం 17 ఏళ్ల ప్రజ్ఞానంద రెండవ స్థానంలో నిలిచాడు. నార్వేకు చెందిన కార్ల్సన్ అత్యధిక స్కోర్తో టాప్ ప్లేస్ కొట్టేశాడు. కార్ల్సన్కు 16 మ్యాచ్ పాయింట్లు దక్కగా, ఇండియన్ గ్రాండ్మాస్టర్కు 15 పాయింట్లు వచ్చాయి.
పేలవంగా ఆడుతున్నా.. ఫలితాలు మాత్రం మంచిగా వస్తున్నట్లు కార్ల్సన్ అభిప్రాయపడ్డారు. అయితే మూడవ స్థానంలో అలిరిజా ఫిరౌజా నిలిచాడు. అతను కూడా 15 పాయింట్లు సాధించాడు. కానీ ప్రజ్ఞాపై ఓడినందుకు అతను మూడవ స్థానాన్ని సరిపెట్టుకున్నాడు. కార్ల్సన్-ప్రజ్ఞా మధ్య జరిగిన తొలి రెండు గేమ్లు డ్రా అయ్యాయి. నాలుగవ గేమ్ను గెలిచిన ప్రజ్ఞా .. మ్యాచ్ను టై బ్రేక్లోకి నెట్టేశాడు. టై బ్రేక్లో రెండు గేమ్లు గెలిచి కార్ల్సన్కు షాకిచ్చాడు.