హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తేతెలంగాణ) ః ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ముందుకొచ్చారు. కోటి రూపాయల విరాళం ప్రకటించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్, మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్లు తమ వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. తాజాగా ప్రభాస్ సైతం వరద బాధితుల కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. నిరాశ్రయులకు ఈ డబ్బు కొంతైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సహాయం అందించినట్లు ప్రభాస్ తెలిపారు.