సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): నేపాల్లో నిర్వహించిన ‘ఆసియా యూత్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ 2021’లో రంగారెడ్డి జిల్లా అథ్లెట్లు సత్తా చాటారు. ఈనెల 22 నుంచి 24 తేదీల్లో పోఖ్రా నగరంలో వరల్డ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో అండర్-17లో ఎస్.హర్షవర్ధన్ 100 మీటర్లు, కె.కిరణ్ 3వేల మీటర్లు, అండర్-19 ఎం.అభినవ్రెడ్డి 200 మీటర్లు, పి.ప్రశాంత్ 3వేల మీటర్లలో తమ సత్తాను చాటారు. పురుషుల సీనియర్ విభాగాల్లో 4 బంగారు పతకాలు సాధించి భారత జాతీయ జెండాను రెపరెపలాడించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన యువకులతోపాటు కోచ్ తిప్పాన సాయిరెడ్డిని తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర క్రీడల శాఖ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టాన్లీ జోన్స్, జనరల్ సెక్రటరీ సారంగపాణి, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ ఈ.గోపి, చైర్మన్ ఎంఎన్ జయకుమార్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అభినందనలు తెలియజేశారు.