విజయ్ధరణ్, రాశీసింగ్, అక్షత సోనావానే నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘పోస్టర్’. టి.మహిపాల్రెడ్డి దర్శకుడు. టి.శేఖర్రెడ్డి, ఏ గంగారెడ్డి, ఐజీరెడ్డి నిర్మాతలు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ఆకాష్పూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల అనుబంధానికి ప్రేమ, యాక్షన్ అంశాలను మేళవించి ఈ సినిమాను తెరకెక్కించాం. కొడుకు భవిష్యత్తు కోసం ఓ తండ్రి పడిన తపన ఉద్వేగాన్ని పంచుతుంది. సామాజిక అంతరాల కారణంగా ఓ ప్రేమజంటకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయనేది ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. ట్రైలర్, పాటలు కొత్తగా ఉన్నాయని, సినిమా చూడాలనే ఆసక్తిని కలిగిస్తున్నాయని ఆకాష్పూరి పేర్కొన్నారు. వాస్తవికతను ప్రతిబింబిస్తూ సాగే చిత్రమిదని హీరో చెప్పారు. ఈ కార్యక్రమంలో శేఖర్రెడ్డి, శాండీ తదితరులు పాల్గొన్నారు.