IL T20 : ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఐదు టైటిళ్లు గెలుపొందిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. టీ20 లీగ్స్లో తమకు ఎదురేలేదని చాటుతూ ఇంటర్నేషనల్ లీగ్ టీ20(IL T20)లో ఎంఐ ఎమిరేట్స్(MI Emirates) జట్టు చాంపియన్గా అవతరించింది. తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం దుబాయ్ క్యాపిటల్స్(Dubai Capitals)తో జరిగిన ఫైనల్లో 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టైటిల్ పోరులో నికోలస్ పూరన్(57 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), మహమ్మద్ వసీం(43)లు చితక్కొట్టడంతో ముంబై ప్రత్యర్థి ముందు 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొండంత ఛేదనలో దుబాయ్ ఆటగాళ్లు ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ కొట్టలేకపోయారు. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్(40) పోరాడినా ఇతరుల నుంచి సహకారం అందకపోవడంతో దుబాయ్ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది.
✨ 𝙒𝙚 𝙖𝙧𝙚 𝙩𝙝𝙚 𝘾𝙃𝘼𝙈𝙋𝙄𝙊𝙉𝙎 ✨ 💙#OneFamily #MIEmirates pic.twitter.com/oU618UjRXA
— MI Emirates (@MIEmirates) February 17, 2024
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ జట్టు 3 వికెట్ల నష్టానికి 208 రన్స్ కొట్టింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పూరన్(57) హాఫ్ సెంచరీతో కదం తొక్కగా.. అండ్రే ఫ్లెచర్(53), మహమ్మద్ వసీం(43)లు దంచికొట్టారు. భారీ ఛేదనలో దుబాయ్ క్యాపిటల్స్ టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్(40), టామ్ బాంటన్(35)లు మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, విజయకాంత్ వియస్కాంత్లు చెరో రెండేసి వికెట్లు పడగొట్టడంతో దుబాయ్ 163 పరుగులకే పరిమితమైంది. పూరన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికవ్వగా.. సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.