హైదరాబాద్ : కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడంతో పెట్రోల్, డిజిల్ విక్రయం క్రమంగా పెరుగుతున్నది.
కరోనా నేపథ్యంలో గతేడాది దేశవ్యాప్త లాక్డౌన్ విధించినప్పుడు కనిష్ఠ స్థాయిలో ఉన్న పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఈ ఏడాది మార్చి నాటికి వరుసగా 27.4 శాతం, 28.6 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థలు దేశ అవసరాల్లో 90 ఇంధనం విక్రయిస్తున్నాయి.
ఈ మూడు సంస్థలు గత నెల 2.47 మిలియన్ టన్నుల పెట్రోల్ను విక్రయించాయి. డీజిల్ వినియోగం పెరుగుదల దేశ ఆర్థికాభివృద్ధిని సూచిస్తున్నది.. 40 శాతం శుద్ధి చేసిన ఇంధనం దేశంలోనే అమ్ముడైంది.
మార్చిలో 6.41 మిలియన్ టన్నుల డీజిల్ అమ్ముడుపోయింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది మార్చి 24న దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు.
దీంతో ఇంధన వినియోగం భారీగా పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పరిశ్రమల కార్యకలాపాలు, రవాణా పెరగడంతో ఇంధన విక్రయాలు ఉపందుకున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మార్చి 15 నాటికి డీజిల్ వినియోగం 7 శాతం, పెట్రోల్ 5 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. కేంద్రం ఇంధనానికి రాయితీని తగ్గించడంతో పెట్రోలియం, గ్యాస్, వంట గ్యాస్ అమ్మకాలు గత నెలలో 1.2 శాతం తగ్గి 2.26 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.
జెట్ ఇంధన అమ్మకాలు 4.4 శాతం తగ్గి 437,000 టన్నులకు చేరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి