లండన్: క్రికెట్లో కొత్త సంస్కరణలకు మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్సీసీ) సిద్ధమైంది. ఇందులో ముఖ్యంగా బంతిపై మెరుపు కోసం ఉమ్మి (సలీవా) రాయడాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు మన్కడింగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బంతిపై మెరుపు తీసుకొచ్చేందుకు ఉమ్మికి బదులు చెమట వాడొచ్చని పేర్కొంది. బంతిని స్వింగ్ చేసేందుకు సలీవా పెద్దగా ఉపయోగపడదని పేర్కొన్న ఎమ్సీసీ ఆకారాన్ని దెబ్బ తీసేందుకు ఎలాంటి ప్రయత్నాలకు పూనుకోవద్దని సూచించింది. మన్కడింగ్ను లా 41(అన్ఫెయిర్ ప్లే) నుంచి లా 38 (రనౌట్)కు మార్చిని ఎమ్సీసీ.. మన్కడింగ్ పేరులో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. మిగతా నిబంధనల విషయానికొస్తే.. బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే కొత్తగా వచ్చే బ్యాటర్ స్ట్రైకింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. మైదానంలో ఎవరైనా ఆటకు అంతరాయం కల్గిస్తే.. ఆ సమయంలో వేసే బంతిని డెడ్బాల్గా పరిగణిస్తారు. క్రీజులో ఉండే బ్యాటర్ పొజిషన్ను బట్టి అంపైర్ వైడ్ను నిర్ధారించనున్నారు. మైదానంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కదిలితే డెడ్బాల్గా పరిగణించడంతో పాటు బ్యాటింగ్ చేసే జట్టుకు ఐదు పరగులు పెనాల్టీగా ఇవ్వనున్నారు. ఎమ్సీసీ ప్రతిపాదించిన ఈ నిబంధనలన్నీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని మేనేజర్ ఫ్రేజర్ స్టివార్ట్ పేర్కొన్నారు.