బొకారో: కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకొనేందుకు కొంతమంది ఇప్పటికీ బయపడుతుంటారు. పక్షవాతంతో నాలుగేండ్లుగా మంచానికే పరిమితమై ఉన్న ఓ వ్యక్తి టీకా తీసుకున్న తర్వాత నడవగలుగుతున్నానని, మాట్లాడగలుగుతున్నానని చెబుతున్నాడు. నాలుగేండ్ల కింద జరిగిన యాక్సిడెండ్తో జార్ఖండ్లోని బొకారో జిల్లాలో సల్గాది గ్రామానికి చెందిన 55 ఏండ్ల దులార్చంద్కు మాట కోల్పోవడంతో పాటు పక్షవాతం కూడా వచ్చింది. జనవరి 4న కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.