కరాచీ: స్వదేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీషిప్ మిస్సైల్ను ఇవాళ పాకిస్థాన్ నేవీ(Pakistan Navy ) విజయవంతంగా పరీక్షించింది. చాలా దూరంలో ఉన్న టార్గెట్లను ఆ మిస్సైల్ చేరుకోగలదని పాక్ మిలిటరీ పేర్కొన్నది. నౌకల నుంచి లాంచ్ చేసే ఆ యాంటీషిప్ మిస్సైల్ను నేవీ విజయవంతంగా పరీక్షించినట్లు ఐఎస్పీఆర్ ప్రకటించింది. నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్తో పాటు ఇతర శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు .. మిస్సైల్ ఫైరింగ్ ఈవెంట్ను వీక్షించారు. అత్యాధునిక గైడెన్స్ సిస్టమ్తో పాటు అడ్వాన్స్డ్ మాన్యువరబులిటీ ఉన్నట్లు పేర్కొన్నారు. శత్రవుల క్షిపణుల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు. పరిస్థితులకు తగినట్లు డైనమిక్గా మారుతుందని, చాలా కచ్చితత్వంతో ఆ క్షిపణి ప్రాణాంతకంగా మారుతుందని మిలిటరీ పేర్కొన్నది. ప్రాంతీయ సముద్ర భద్రత, స్థిరత్వం నేపథ్యంలో మిస్సైల్ ఫైరింగ్ ఈవెంట్ నిర్వహించినట్లు చెప్పారు. అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి, ప్రధాని షెహబాజ్ షరీఫ్, సీడీఎఫ్ అసిమ్ మునీర్ తాజా పరీక్ష పట్ల హర్షం వ్యక్తం చేశారు.