న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా రెండోవేవ్లో ఆక్సిజన్ అందక వేలాది మంది బాధితులు విలవిల్లాడారు. ఆక్సిజన్ సిలిండర్లను మారుమూల ప్రాంతాలకు, కొండ ప్రాంతాలకు తీసుకెళ్లి బాధితులకు అందించడం కష్టమైన పని. అందుకే ఎక్కడికైనా సరే సులువుగా తీసుకెళ్లగలిగే వీలున్న బ్యాగ్ వంటి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను రూపొందించింది జీఆర్ఎస్ ఇండియా అనే స్టార్టప్ కంపెనీ. దీనికి ‘ఆక్సిజన్ ప్లస్’ అని పేరు పెట్టారు. ఈశాన్య రాష్ర్టాల్లోని మారుమూల ప్రాంత ప్రజలకు ఇదొక వరంగా మారుతుందని స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పైగా ఈ పరికరం మొబైల్ యాప్నకు అనుసంధానమై ఉండి, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిని తెలియజేస్తుందని వెల్లడించారు.