13 నుంచి సెల్ట్లో తరగతులు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 13వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’పేరుతో నిర్వహించే రెండు నెలల కోర్సును ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ పేర్లను ఈ నెల 12వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఫీజును డీడీ ద్వారాగానీ, ఆన్లైన్ పేమెంట్ ద్వారా గానీ స్వీకరిస్తామన్నారు. ఇతర వివరాలకు 9014500509 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.
బీఈ పరీక్షా ఫలితాల విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (నాన్ సీబీసీఎస్) బ్యాక్లాగ్ పరీక్షలు, బీఈ (ఏఐసీటీఈ) అన్ని సెమిస్టర్ల మెయిన్, బ్యాక్లాగ్ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
డిగ్రీ పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని డిగ్రీ కోర్సుల మూడు, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేసినట్లు, ఫలితాలను ఓయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మూడు వారాల తరువాత సంబంధిత కళాశాల నుంచి మెమోలు పొందవచ్చని పేర్కొన్నారు. రివాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు టీఎస్ ఆన్లైన్ సెంటర్లలో ఈ నెల 13వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 15వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. జవాబు పత్రాల నకలు పొందగోరేవారు తమ కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చన్నారు.
బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (ఏఐసీటీఈ) కోర్సుల ఆరో సెమిస్టర్ మెయిన్, రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, మొదటి, మూడు, అయిదో సెమిస్టర్ బ్యాక్లాగ్, బీఈ (సీబీసీఎస్) కోర్సుల అన్ని సెమిస్టర్ బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 15వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.
రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఈ నెలాఖరులో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చని సూచించారు.
వెంటనే డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించండి
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల విద్యార్థులకు వెంటనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్కు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ నిర్దేశించారు. డిగ్రీ రెండు, నాలుగో సెమిస్టర్ బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ప్రాజెక్ట్, వైవా పరీక్షలను వెంటనే నిర్వహించి, ఈ నెల 14 లోపు వెబ్సైట్లో మార్కులు నమోదు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆ మార్కుల జాబితాను వచ్చే నెల 18వ తేదీలోగా తమ కార్యాలయానికి చేర్చాలని సూచించారు. పరీక్షలకు హాజరుకాని వారికి తిరిగి పరీక్షలు నిర్వహించే ప్రసక్తేలేదన్నారు.
వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీడీసీఏ (సీడీఈ) మొదటి సెమిస్టర్ మెయిన్, బ్యాక్లాగ్, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా తేదీలను మార్చినట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలను ఈ నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ http://www.osmania.ac.in చూసుకోవచ్చన్నారు.
డీడీఎంఎస్ లో ఫార్మసీ అసిస్టెంట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (పాత ఏఎంఎస్)లో ఫార్మసీ అసిస్టెంట్ (మూడు నెలలు) కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డీడీఎంఎస్ నొకేషనల్ కోర్స్ సెంటర్లో ఈ కోర్సును అందిస్తున్నట్లు చెప్పారు.
కనీసం పదవ తరగతి పాసైన అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని వివరించారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర వివరాలకు 9397824542 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.