అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో మోస్తారులో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు ఎత్తి దిగువకు 15,370 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్ఫ్లో 20,758 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 20,338 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 100.855 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 1633.00 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్షన్ అధికారి విశ్వ నాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు ..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టణంతో వరద స్వల్పంగా చేరుతోంది. బుధవారం ఆనకట్టకు 12,233 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, 11,800 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.2 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 433 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.