సికింద్రాబాద్, జనవరి 5: ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిఖ్ విలేజ్ అంబేద్కర్నగర్కు చెందిన దుబ్బాక అనిల్ సమీపంలోని మస్తాన్ చౌరస్తాలో దినపత్రికలు విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నా డు. దీంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూల్ కు విద్యార్థులను ఆటో తీసుకెళ్తుంటాడు. అనిల్కు అనితతో 10 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొమ్మిదేండ్ల కూతురు సాత్విక ఉంది.
ఈనెల 2వ తేదీన ఇంటి కరెంట్ బిల్లు కట్టకపోవడంతో విద్యుత్ను నిలిపివేశారు. అదే విధంగా ఇంట్లో నిత్యావసర సరుకులు సైతం లేకపోవడంతో రాత్రి 9గంటలకు ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో యథావిధిగా 3వ తేదీన దినపత్రికల విక్రయాల కోసం ఉదయం 5గంటలకే దుకాణానికి వెళ్లా డు. అనంతరం స్కూల్ విద్యార్థులను ఆటోలో పాఠశాలలకు తీసుకెళ్లి దుకాణానికి వచ్చాడు.
సెల్ఫోన్, ఆటో తాళం చెవులను దుకాణం లో ఇచ్చి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే బయటకువెళ్లిపోయాడు.సాయం త్రం అయినా అనిల్ తిరిగిరాకపోవడంతో తెలిసిన వా రితో పాటు బంధువులను, చుట్టుపక్కల వారిని ఆరా తీసిన ఫలితం లేకపోవడం తో 4వ తేదీన కార్ఖానా పోలీస్ స్టేషన్లో అనిల్ భార్య అనిత ఫిర్యాదు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎక్కడికో వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు.వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే కార్ఖానా పోలీస్ స్టేషన్లో గానీ కార్ఖానా సీఐ 9490616457, 9490616309 నంబర్లను సంప్రదించాలని సూచించారు.