న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ XE వేరియంట్కు సంబంధించిన తొలి కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సోర్టియమ్(ఐఎన్ఎస్ఏసీఓజీ).. సార్స్ సీఓవీ2 వైరస్కు చెందిన తాజా బులిటెన్ను రిలీజ్ చేసింది. అయితే ఎక్కడ ఈ కేసు నమోదు అయిందన్న విషయాన్ని ఇన్సాకాగ్ వెల్లడించలేదు. ఏప్రిల్ 25వ తేదీకి చెందిన బులిటెన్ను ఇవాళ రిలీజ్ చేశారు. గడ వారంతో పోలిస్తే, ఈ వారంలో 12 రాష్ట్రాల్లో కేసులు అధికంగా నమోదు అయ్యాయని, 19 రాష్ట్రాలు మాత్రం కేసుల సంఖ్యలో తరుగుదల చూపించినట్లు ఆ బులిటెన్లో తెలిపారు. రీకాంబినంట్ స్వీక్వెన్సింగ్ గురించి పూర్తిగా విశ్లేషిస్తున్నామని, BA.2.10, BA.2.12 , BA.2 సబ్ లీనియేజ్లను డిటెక్ట్ చేశామని, అయితే ఆ లీనియేజ్లతో వ్యాధి తీవ్రత ఉన్నట్లు గుర్తించలేదని బులిటెన్లో తెలిపారు.