సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో క్షేత్ర స్థాయిలో ఉన్న ఆయా కార్యాలయాల్లో సంప్రదాయేతర ఇంధన వనరులను అధికార యంత్రాంగం ప్రోత్సహిస్తున్నది. దీంతో పాటు విద్యుత్ బిల్లులు చెల్లింపు భారం కాకుండా పలు కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి జీరో కరెంట్ బిల్లుకు శ్రీకారం చుట్టారు. సంస్థ పరిధిలోని జోనల్, సర్కిల్ కార్యాలయ భవనాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు 941 కేడబ్ల్యూపీ (kwp) సోలార్ పీవీ గ్రిడ్ రూఫ్ టాప్ సిస్టమ్ నెట్ మీటరింగ్ పద్ధతిలో సైప్లె చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్ రెడ్కో)కు రూ.3.50 కోట్లతో కాంట్రాక్టు ఒప్పందం జరిగింది. సోలార్ సిస్టం ఏర్పాటుకు డిజైన్, సపె్లై, బిగింపుతో పాటుగా ఐదేళ్ల వరకు పూర్తి నిర్వహణ బాధ్యత వారిదే ఉంటుంది.
ప్రతి సంవత్సరం 1500 కిలో వాట్స్ మినిమం జనరేషన్ చేయాలి. అంటే 14,11,500 యూనిట్స్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఎకువగా ఎండ ఉన్నప్పుడు నిర్దేశించిన లక్ష్యం కంటే ఎకువ మొత్తంలో జనరేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎకువ జనరేటైన దానిని ఆదా చేస్తే జీహెచ్ఎంసీకి దాదాపు రెండున్నర ఏళ్లలోపు గాని అంతకంటే ముందు గాని రూ.1.27 కోట్ల చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకు 34 కార్యాలయ భవనాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి గడిచిన రెండేళ్లలో 28 లక్షల యూనిట్స్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. సౌర వెలుగులతో జీరో విద్యుత్ బిల్లుతో పాటు సంస్థకు ఖర్చు తగ్గుతుందని, కాలుష్యం తగ్గి ఆహ్లాదకర వాతావరణంగా మారుతుందని అధికారులు తెలిపారు.